కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజానీకానికి కొత్త కరెంట్ స్లాబ్ విధానం తీవ్ర ఆర్థిక భారానికి దారి తీస్తుందని పశ్చిమగోదావరి జిల్లా బిజేపి జనరల్ సెక్రటరీ, మహిళా మొర్చ అధ్యక్షురాలు బలుసు మాధవీలత అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఇప్పుడు అమలులో ఉన్న విధానాన్ని రద్దు చేసి పాత స్లాబ్ ప్లాన్ విధానాన్ని కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు.
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తన ఇంటి వద్దనే ఏపి ప్రభుత్వ తీరుపై ఆమె నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు భూమి లేకుండా ప్రజలకు ఉచిత పంపిణీ అనే ముసుగులో తమ పార్టీ నాయకులకు ఖాళీ స్థలాలు ధారాదత్తం చేస్తున్న జీవోను వెంటనే రద్దు పరచాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.