గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడిని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. జగన్ అధికారం శాశ్వతం కాదు, ప్రజలు తిరగబడిన రోజున మీకు ఎవరు తోడు వుండరు అని ఆయన హెచ్చరించారు. జగన్ అధికారంలోకి వచ్చిన 6 నెలలోపే అరాచకపాలన మొదలు పెట్టారు… అరాచక పాలనకు తోడు పోలీస్ వ్యవస్థ కూడా దిగజారిపోయింది… అరాచకాలు చేస్తున్న వారిని వదిలిపెట్టి పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు… పోలీసు వ్యవస్థ అరాచక వాదులకు అనుగుణంగా నడుస్తున్నారా అని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పట్టాభిని ఎక్కడ దాచారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎవరికయినా అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు, పోలీసులే పట్టించుకోకపోతే ఎవరిదగ్గరకు వెళ్లాలని ప్రశ్నించారు. డిజిపి తక్షణమే రాష్ట్రంలో జరిగే అరాచకాలకి స్వస్తిపలకాలని సూచించారు.
previous post
next post