నంద్యాల జిల్లా శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారి నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అక్క మహదేవ అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నంది వాహనంపై అధిరోహింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మేళతాళాలతో నందీశ్వరుడు నడచి రాగా అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో లవన్న, దేవస్థానం అధికారులు వేలాది భక్తులు పాల్గొన్నారు. దక్షిణ మాడ వీధిలో ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు ఈవో అందజేశారు.