33.2 C
Hyderabad
May 4, 2024 01: 20 AM
Slider వరంగల్

పేద ప్రజలను దోచుకుతింటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

#BJPMulugu

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన L.R.S స్కీంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బిజెపి ములుగు జిల్లా అధ్యక్షులు  చింతలపూడి భాస్కర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

అధికార పార్టీ నేతలు ఇష్టారీతిన కబ్జా చేసిన భూములను రెగ్యులరైజ్ చేసుకుంటూ పేదవారి పొట్ట కొడుతున్నారని ఆయన ఆరోపించారు ఈ స్కీమ్ లో విధించిన రుసుంను కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఆ భూములను అమ్ముకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకునే విధంగా స్కీము చేపట్టాలని లేనిచో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తక్కలపెల్లి దేవేందర్ రావు అజ్మీర కృష్ణవేణి నాయక్ రాజు నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్ ములుగు మండల అధ్యక్షులు ఇమ్మడి రాకేష్ యాదవ్

జిల్లా ఉపాధ్యక్షులు అడప బిక్షపతి ఏనుగు రవీందర్ రెడ్డి జిల్లా కార్యదర్శులు చిలమంతుల రవీంద్ర చారి కర్ర సాంబశివ రెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు జింకల కృష్ణాకర్ జిల్లా కోశాధికారి కోమ్మిరెడ్డి నరసింహారెడ్డి జిల్లా కార్యదర్శి చల్లూరి మహేందర్ చింతలపూడి చిన్న కొండ రెడ్డి గోవిందరావుపేట మండల అధ్యక్షులు మద్దినేని రాజు

ములుగు మండల ప్రధాన కార్యదర్శి ఓజ్జల కిరణ్ ఉపాధ్యక్షులు కోయిల కవిరాజు కొత్తకొండ రామన్న మేకల రవి జిల్లా నాయకులు గంగిశెట్టి రాజకుమార్ కొండూరి రవీందర్ హాటుకరు రాజ్ కుమార్ బీజేవైఎం నాయకులు కొత్త సురేందర్ దొంతి రెడ్డి రాకేష్ రెడ్డి హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related posts

Protest: పలుచోట్ల విజయవంతమైన జాతీయ బంద్

Satyam NEWS

మహిళను బ్లాక్ మెయిల్ చేసిన వాడికి శిక్ష

Satyam NEWS

పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి స్పూర్తిదాయకం

Satyam NEWS

Leave a Comment