40.2 C
Hyderabad
May 5, 2024 16: 44 PM
Slider నల్గొండ

బర్నింగ్ డిజైర్: మా నాయకుడికి అన్యాయం చేస్తారా?

వైస్ చైర్మన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పడంతో టీఆర్ఎస్ నాయకుడు ఒకరు తీవ్రంగా మనస్థాపం చెందాడు. ఆయన మస్థాపం చెందడాన్ని చూసి తట్టుకోలేని ఆయన అభిమాని ఒకరు ఆత్మహత్యాయత్నం చేయడంతో సూర్యాపేట లో ఒక్క సారిగా సంచలనం కలిగింది. షేక్ బాషా మియా సూర్యాపేట 5 వ వార్డు కౌన్సిలర్ గా గెలిచారు. ఆయనకు వైస్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పారు. అయితే టిఆర్ఎస్ అధిష్టానం ఆయనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకో లేదు.

దాంతో ఆయన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయాలనే యోచనతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశాడు. సమావేశం జరుగుతుండగా కౌన్సిలర్ షేక్ బాషా మియా అభిమాని సూర్య నాయక్ ఆత్మహత్యయత్నం చేశాడు. తన నాయకుడు మనస్తాపంతో ఉండటం చూసి తట్టుకోలేక వంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అయితే అదృష్టవశాత్తూ అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని అతని వంటిపై నీళ్లు పోశారు.

Related posts

పది రోజుల్లో ప్రతి ఇంటి ముందు పండ్ల మొక్కలు నాటాలి

Satyam NEWS

“అడుగుల సవ్వడి”..పుస్తకావిష్కరణ..

Satyam NEWS

ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. అందుకే ఓటరు జాబితా సవరణ

Satyam NEWS

Leave a Comment