విజయనగరం జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన కు ప్రజల నుండి 218 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 16, డి.ఆర్.డి.ఏ కు 08, అందగా రెవిన్యూ కు సంబంధించి 194 వినతులు అందాయి. ముఖ్యంగా సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, ఉప కలెక్టర్ పద్మా వతి, సూర్యనారాయణ స్వీకరించారు.
అడుగుల సవ్వడి పుస్తకావిష్కరణ
జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతి రావు స్వీయ రచనలో ముద్రించిన అడుగుల సవ్వడి వచన కవిత్వం పుస్తకాన్ని జిల్లా కలెక్టరు సూర్య కుమారి స్పందన లో ఆవిష్కరించారు. ఈ పుస్తక పరిచయాన్ని , పుస్తక విషయాలను, విశేషాలను లక్ష్మణ రావు వివరించారు.