తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ – H143) రాష్ట్ర ద్వితీయ మహా సభల పోస్టర్ ను ములుగు జిల్లా పరిషత్ ఆవరణంలో ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం జర్నలిస్టులు సైతం మన రాష్ట్రంలో – మన యూనియన్ పేరుతో ఉద్యమించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు నూతన ఉత్సాహంతో యూనియన్ ఆవిష్కరించుకుని తెలంగాణ ఉద్యమ పోరాటంలో పోరాట ప్రతిభ కనబరిచిన యూనియన్ ద్వితియ మహాసభలకు జర్నలిస్టు మిత్రులు తరలిరావాలని పిలుపునిచ్చారు. పటాన్చెరువులో ఈనెల 8వ తేదీన జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లోని జరగనున్న రెండవ ద్వితీయ టీయూడబ్ల్యూజే హెచ్ 143 మహాసభలు తో పాటు 8, 9, 10 వ తేదీలలో ఐజేయు పదవ ప్లీనరీ సమావేశాల జర్నలిస్టుల జాతరకు తరలిరావాలని పోస్టర్ లో పేర్కొన్నారు.
ఆవిష్కరణలో భాగంగా ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ తో పాటు టియుడబ్ల్యూజే హెచ్ 143నాయకులు కొట్టే రాజిరెడ్డి, చుంచు రవి, దూడబోయిన రాకేష్, రామిడి కృష్ణారెడ్డి, పోలోజు రామ్మూర్తి, గండ్రకోట విష్ణుకుమార్, వేముల సతీష్, గాదం దేవేందర్ బి ఆర్ యస్ మండల అధ్యక్షులు భాదం ప్రవిణ్, పట్టణ అధ్యక్షులు విజయకుమార్, వేల్పరి సత్యం తదితరులు పాల్గొన్నారు.