సంగారెడ్డి జిల్లా పరిధిలోని 17 ల్యాండ్ పార్సెల్ విక్రయానికి వీలుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) అధికారులు, సంగారెడ్డి జిల్లా రెవిన్యూ అధికారులు గురువారం గీతం యూనివర్సిటీ లో నిర్వహించిన ఫ్రీ బిడ్ సమావేశానికి బిడ్డర్లు పోటా పోటీగా పాల్గొని విజయవంతం చేశారు. దాదాపు 150 మంది ఔత్సాహికులు, రియాల్టీల ప్రతినిధులు, స్థానికులు హాజరయ్యారు.
ఈ ఫ్రీ బిడ్ సమావేశానికి హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ (ఈవో) గంగాధర్, సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో మహేష్, హెచ్ఎండిఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సిపిఓ) గంగాధర్ లతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన అమీన్ పూర్, ఇస్నాపూర్, రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ పార్షిల్స్ ఉండడంతో ఎంతో మంది ఔత్సాహికులు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపుతున్నారు.