జాతీయ స్థాయిలో ఎదుగుదామనుకుంటున్న బీఆర్ఎస్ కు స్థానికంగానే నష్టం జరుగుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి కృష్ణారావు బి ఆర్ ఎస్ పార్టీ పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దాంతో బీఆర్ఎస్ నుంచి ఆ ఇద్దరు నేతలను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఖమ్మం జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు, ఉమ్మడి మహబుబూనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ వీరుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరూ కూడా సీఎం కేసీఆర్ కు ఒకప్పుడు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం.