కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 2 నుండి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మార్చి 2న సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. మార్చి 3న ఉదయం 8 నుండి 8.45 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
మార్చి 4న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీవారి గరుడ వాహన సేవ జరుగనుంది. మార్చి 5, 6వ తేదీల్లో సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఊంజల్సేవ చేపడతారు. మార్చి 7న ఉదయం 10.30 నుండి 11.15 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. మార్చి 8న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.