29.7 C
Hyderabad
May 3, 2024 06: 52 AM
Slider ఆధ్యాత్మికం

పిఠాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాలు

#tirumala

కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 2 నుండి 8వ తేదీ వరకు వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. మార్చి 2న సాయంత్రం 6 గంట‌ల‌కు మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. మార్చి 3న ఉద‌యం 8 నుండి 8.45 గంట‌ల‌ వరకు ధ్వజారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం నిర్వ‌హిస్తారు.

మార్చి 4న  సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి గ‌రుడ వాహ‌న సేవ జ‌రుగ‌నుంది. మార్చి 5, 6వ తేదీల్లో సాయంత్రం 6.30  నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్‌సేవ చేప‌డ‌తారు. మార్చి 7న ఉద‌యం 10.30 నుండి 11.15 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం, సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వహించనున్నారు. మార్చి 8న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం నిర్వ‌హిస్తారు.

Related posts

ఇంటర్ లో మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య

Satyam NEWS

దళితుల భూముల్లో మెగా పార్కు నిర్మించవద్దు

Satyam NEWS

న‌గ‌ర రోడ్ల‌పై విజయనగరం ఎస్పీ ఆక‌స్మిక త‌నిఖీలు

Satyam NEWS

Leave a Comment