రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన హిమాంనగర్ గ్రామ సమీపంలో జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం ఎలా ఉన్నాయి. కొత్తగూడెం నుండి తల్లాడవైపు వెళుతున్న బొలెరో వాహనం అదే సమయంలో ఏన్కూరు నుండి కొత్తగూడెం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ద్విచక్ర వాహనంపై ఉన్న ముడిగం సాంబయ్య (28) పూనెం వంశీ(23) మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఏనుకూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సమాచారం సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.