28.7 C
Hyderabad
April 27, 2024 04: 58 AM
Slider ప్రకాశం

మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం బోల్తా

#Minister Balineni

ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పాపయ్య మరణించారు. ఆయనతో బాటు ఉన్న మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

అవుటర్ రింగ్ రోడ్డు పై వస్తుండగా ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ అవ్వడం తో ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం పల్టీకొడుతూ వెళ్లింది. గాయపడిన వారిని హయత్ నగర్ లోని హాస్పిటల్ కి తరలించారు. గచ్చిబౌలి నుండి విజయవాడకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Related posts

ఎరువుల దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు

Bhavani

సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

Satyam NEWS

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన ధర్నాను జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment