ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పాపయ్య మరణించారు. ఆయనతో బాటు ఉన్న మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
అవుటర్ రింగ్ రోడ్డు పై వస్తుండగా ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ అవ్వడం తో ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం పల్టీకొడుతూ వెళ్లింది. గాయపడిన వారిని హయత్ నగర్ లోని హాస్పిటల్ కి తరలించారు. గచ్చిబౌలి నుండి విజయవాడకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.