29.7 C
Hyderabad
May 4, 2024 06: 20 AM
Slider నిజామాబాద్

కీచక ప్రిన్సిపల్ నాంపల్లి హెడ్ ఆఫీస్ కు అటాచ్

principal

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాలలో స్టాఫ్ నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ను నాంపల్లి హెడ్ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా తనను ప్రిన్సిపాల్ లైంగికంగా వేధిస్తున్నాడని, ఆయనకు లొంగనందుకు వ్యక్తిగతంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని స్టాఫ్ నర్స్ సునీత మద్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ విషయంలో విచారణ చేపట్టిన పోలీసులు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు అతనికి రిమాండ్ విధించింది. దాంతో ప్రభుత్వం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పై చర్యలకు ఉపక్రమించింది. మద్నూర్ పాఠశాల నుంచి నాంపల్లి హెడ్ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts

జగన్ మూడేళ్ల పాలనలో నకిలీ రత్నాలుగా మారిన నవరత్నాలు

Satyam NEWS

కొత్త రేష‌న్‌కార్డుల జారీ, పేరు న‌మోదు ఎప్పుడో?

Sub Editor

నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు

Satyam NEWS

Leave a Comment