ప్రఖ్యాత యానిమేషన్ అండ్ గేమింగ్ కళాశాల ‘క్రియేటివ్ మెంటార్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ రెడ్డి కొవ్వూరి యు కె పార్లమెంట్, హౌస్ అఫ్ కామెన్స్, లండన్ లో నిర్వహించిన యు కె బిజినెస్ మీట్ నుండి ప్రతిష్టాత్మకమైన ‘మోస్ట్ ప్రామిసింగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్’ అవార్డును అందుకున్నారు. కన్నుల పండువగా జరిగిన కార్యక్రమం లో క్రీయేటివ్ మెంటర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ ద్వారా యానిమేషన్ కు చేసిన విశేష కృషికి గుర్తింపుగాను UK పార్లమెంట్ సభ్యుడు వీరేంద్ర శర్మ ఈ అవార్డును సురేష్ కొవ్వూరి కి అందిందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు సల్మాన్ ఖుర్షిడ్, మనోజ్ కుమార్, తేజస్వి యాదవ్, మహువ మెహతా, సీతారాం ఏచూరి తెలంగాణ నుండి ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ లతో సహా పలువురు పాల్గొన్నారు.
యానిమేషన్, గేమింగ్ ఇండస్ట్రీ అభివృద్ది చెందుతున్న పరిశ్రమ. ఇది భారతదేశానికి ప్రత్యేకించి AR/VR లతో ప్రత్యేక ముద్ర వేయడానికి అధ్బుతమైన సామర్ధ్యాన్ని కలిగి ఉంది. AR/VR , ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి వినూత్న పరిష్కరాలను అందించడానికి, అగ్రగామిగా ఉండడానికి ప్రపంచ భారతీయ యానిమేషన్ పరిశ్రమ వైపు చూస్తున్నది. ప్రతిష్టాత్మకమైన ఆసియా UK బిజినెస్ మీట్ 2022 నుండి అందుకోవడం క్రెయేటివ్ మెంటర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ చేస్తున్న అద్భుతమైన పనిని ప్రదర్శించేందుకు, అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు అవసరమైనా ప్రోత్సహాన్ని ఇస్తుందని సురేష్ రెడ్డి కొవ్వూరి పేర్కొన్నారు.
క్రియేటివ్ మెంటర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ 2007లో హైదరాబాద్ లో స్థాపించారు. ఇది విద్యార్థులకు యానిమేషన్ మరియు గేమింగ్ డొమైన్ కు సంబంధించి అత్యుత్త మైన నాణ్యమైన పరిజ్ఞానాన్ని అందించడంలో ప్రసిద్ధి చెందింది. (BA Hons) (BNC Hons) డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ డిప్లొమా మరియు సర్టిఫికేషన్ ప్రోగ్రాంలను అందిస్తున్నది. అత్యుత్తమమైన అర్హత కలిగిన అధ్యాపక బృందం ఉంది. విద్యార్థులకి విశాలమైన తరగతి గదులు, అన్ని వసతులు కలిగిన ల్యాబ్స్ మరియు wifi సదుపాయం కలిగిన క్యాంపస్ తో సహా ఎన్నో ప్రాథమిక సౌకర్యాలను అందిస్తుంది.