42.2 C
Hyderabad
May 3, 2024 18: 40 PM
Slider ప్రకాశం

మునిగిపోతున్న మహిళల్ని కాపాడిన పోలీసులు

#women

బీచ్ లో మునిగిపోతున్న నలుగురు మహిళల ప్రాణాలను బాపట్ల జిల్లా పోలీసులు కాపాడారు. చీరాల వాడరేవు బీచ్ కు వినాయకుని నిమజ్జనం నిమిత్తం వచ్చిన భక్తులలో నలుగురు మహిళలు సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి వారు సముద్రంలో మునిగిపోయారు.

ఇది గమనించిన మెరైన్ పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించారు. సముద్రంలోకి దూకి మునిగిపోతున్న నలుగురు మహిళలను రక్షించి ఒడ్డుకు చేర్చి వారి బంధువులకు అప్పగించారు. నలుగురు మహిళలను రక్షించిన బాపట్ల పోలీసులను డి.జి.పి. రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు.

Related posts

ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు

Bhavani

భూపాలపల్లి కలెక్టర్ ను కలిసిన టీయూడబ్ల్యూజే నేతలు

Satyam NEWS

సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తూ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధర పెంచుతారా?

Satyam NEWS

Leave a Comment