జిహెచ్ఎంసి పరిధిలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విభాగాన్ని హెచ్ ఎం డబ్ల్యు ఎస్ &ఎస్ బి డిపార్ట్ మెంట్ కు బదిలీ చేయబోతున్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయాలని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. కాప్రా మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం UGD విభాగంపై సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశo కాప్రా డీసీ శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీదేవి మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(UGD) విభాగాన్నిజీహెచ్ఎంసీ నుంచి తిరిగి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డ్(HMWS&SB) డిపార్ట్మెంట్ కు వచ్చే నెల నుంచి బదిలీ చేస్తున్నారన్నారు.
అదేవిధంగా UGD విభాగం అధికారులు, సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి డ్రైనేజీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో HMWS&SB జనరల్ మేనేజర్ జాన్ షరీఫ్, DGM కృష్ణ, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఈఈ కోటేశ్వరరావు, కాప్రా సర్కిల్ కార్పోరేటర్లు స్వర్ణరాజ్, శివమణి, ప్రభుదాస్, దేవేందర్ రెడ్డి, శాంతి సాయి జెన్ శేఖర్, అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.