కడప జిల్లా లో IAS ల మండలం గా పిలువబడే నందలూరు నుండి మరో ఆణిముత్యం సివిల్స్ లో 211 ర్యాంకు సాధించి మండల కీర్తి ప్రతిష్టలను మరోసారి పెంపొందించింది.
నాగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన గొబ్బిళ్ళ విద్యాధరి ఈ ఏడాది నిర్వహించిన సివిల్స్ పరీక్షలో రాణించి 211 ర్యాంకు సాధించింది.
ఐఏఎస్ కావడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించుకొని కష్టపడి చదివి సివిల్స్లో స్థానం పొందింది. ఒకటి నుండి పదవ తరగతి వరకు స్థానికంగా గొబ్బిళ్ళ శంకరయ్య మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో విద్యాభ్యాసం పూర్తి చేసింది.
ఇడుపులపాయలోని త్రిబుల్ ఐటీ లో స్థానం పొంది ఉన్నత శ్రేణి మార్కులతో రాణించి అనంతరం గేట్ పరీక్షలో ర్యాంకు సాధించినా అక్కడ చేరక, సివిల్స్లో శిక్షణ పొంది మంచి ర్యాంకును సొంతం చేసుకొని IAS గా ఎంపిక కానుంది .దీంతో మండలంలోని పలువురు ప్రముఖులు విద్యాధరి ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.