29.7 C
Hyderabad
April 29, 2024 07: 28 AM
Slider ప్రత్యేకం

సివిల్స్ లో 211 ర్యాంకు సాధించిన నందలూరు విద్యార్థిని

#vidyadhari

కడప జిల్లా లో  IAS ల మండలం గా పిలువబడే నందలూరు నుండి మరో ఆణిముత్యం సివిల్స్ లో 211 ర్యాంకు సాధించి మండల కీర్తి ప్రతిష్టలను మరోసారి పెంపొందించింది.

నాగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన గొబ్బిళ్ళ విద్యాధరి ఈ ఏడాది నిర్వహించిన సివిల్స్ పరీక్షలో రాణించి 211 ర్యాంకు సాధించింది.

ఐఏఎస్ కావడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించుకొని కష్టపడి చదివి సివిల్స్లో స్థానం పొందింది. ఒకటి నుండి పదవ తరగతి వరకు స్థానికంగా గొబ్బిళ్ళ శంకరయ్య మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో విద్యాభ్యాసం పూర్తి చేసింది.

ఇడుపులపాయలోని త్రిబుల్ ఐటీ లో స్థానం పొంది ఉన్నత శ్రేణి మార్కులతో రాణించి అనంతరం గేట్ పరీక్షలో ర్యాంకు సాధించినా అక్కడ చేరక, సివిల్స్లో శిక్షణ పొంది మంచి ర్యాంకును సొంతం చేసుకొని IAS గా ఎంపిక కానుంది .దీంతో మండలంలోని పలువురు ప్రముఖులు  విద్యాధరి ని అభినందిస్తూ హర్షం  వ్యక్తం చేశారు.

Related posts

శ్రీకాకుళంలో మరో ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు

Satyam NEWS

లోకేషా ఎంత పని చేశావు లోకేషా…..?

Satyam NEWS

గవిమఠంను సందర్శించిన మంత్రి ఉషశ్రీ చరణ్

Satyam NEWS

Leave a Comment