40.2 C
Hyderabad
May 1, 2024 15: 09 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక

#uttam

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 11వ,వార్డు లోని కస్తాల వీరబాబు ఆధ్వర్యంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో 20 కుటుంబాలకు చెందిన వారు ఎంపీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారిని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారిలో షేక్ రఫీ,సిహెచ్.గోపి,ఎం.మధు, ఎం.గోపి, షేక్ మహమ్మద్ రఫీ,జె.విజయ్, షేక్ అజారుద్దీన్,ఎస్.కిరణ్,కె.రామకృష్ణ, ఎం.శేషు,సిహెచ్.గురుస్వామి,బి.గోపి,ఎం.గోపి,ఉన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చేస్తున్న దాడులకు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి రాష్ట్ర నాయకుడు యరగాని నాగన్న గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు,3వ,వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,ఐ ఎన్ టి యు సి హుజూర్ నగర్ మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి,కస్తాల రవీందర్, రెడపంగు రాము,ఆర్.రాజేష్,ఎం.సురేష్, మంద నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

శుభ్రమైన నీటికోసం ఏపిలో వాటర్ గ్రిడ్

Satyam NEWS

జైమేడారం:హుండీ ఆదాయం రూ.5.63 లక్షలు

Satyam NEWS

విద్యార్ధులకు తగిన సౌకర్యాలు కల్పించాలి

Satyam NEWS

Leave a Comment