నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్, కడ్తాల్ పట్టణంలో అనారోగ్యంతో మృత్యువాత పడిన కుటుంబాలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ఇరువురి కుటుంబాలకు మూడువేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డ్ లో నివాసముంటున్న వెంకటమ్మ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
అదేవిధంగా కడ్తాల్ మండలంలోని నరసింహ అనారోగ్యంతో మరణించారు. అంత్యక్రియల నిమిత్తం మృతుని కుటుంబానికి మూడువేల రూపాయలు వారి కార్యకర్తల ద్వారా అందజేశారు.