38.2 C
Hyderabad
April 29, 2024 14: 18 PM
Slider నిజామాబాద్

BJYM ఆధ్వర్యంలో బిచ్కుంద మండలలో నిరసన కార్యక్రమం

#BJYMProtest

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన  నిర్వహించారు.

అధికార తృణమూల్ కాంగ్రెస్ కక్షపూరిత చర్యల్లో భాగంగా బీజేపీ కార్యకర్తలపై హింసాత్మక దాడులను చేస్తున్నదని బిజెవైఎమ్ నేతలు ఆరోపించారు. బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే కుమారి అరుణతార, బిచ్కుంద మండల బీజేవైఎం మండల అధ్యక్షుడు శెట్టిపల్లి విష్ణు, బిజెపి ప్రధాన కార్యదర్శి రమేష్, బిచ్కుంద మండల్ ఐటీ సెల్ కన్వీనర్ లక్ష్మణాచారి, బిజెపి ఉపాధ్యక్షులు గోపాల్ చారి, గిరిజన మోర్చ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాధవ్ పండరి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాజు పటేల్, బీజేవైఎం ఉపాధ్యక్షుడు దన్నుర్ విట్ఠల్, మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండీ గౌస్, బిజెపి సీనియర్ నాయకులు పస్కె ప్రకాష్, కొట్టే రఘు, ఖలీల్ ,సహాదేవ్, చెందు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతి

Satyam NEWS

ఒక్క స్నాప్  తో ఘ‌ట‌నా స్థ‌లికి పోలీసులు….!ఎక్క‌డంటే…?

Satyam NEWS

‘మా’ ఎన్నికల్లో మెగాస్టార్ మద్దతు ప్రకాష్ రాజ్ కే

Satyam NEWS

Leave a Comment