29.7 C
Hyderabad
May 1, 2024 04: 16 AM
Slider కృష్ణ

వివాహిత చేతిలో మోసపోయిన యువకుడు

#matrimony

వధువు గా పరిచయమై రూ. 12 లక్షలకు టోకరా వేసింది ఒక మహిళ. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన యువకుడు ఒకరు ఈ మహిళ చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయించాడు. ఆ యువకుడు పెళ్లి సంబంధాల కోసం మాట్రిమొని సైట్ లో రిజిస్టర్ చేసుకున్నాడు. దాని నుండి యువకుడి నెంబర్ తీసుకుని యువతిగా ఒక మహిళ మాట్లాడింది. అభిప్రాయాలు కలవడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు అనుకున్నాడు.

దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ మహిళ ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉన్నానని చెప్పి పలు దఫాలుగా డబ్బులు తీసుకున్నది. పలుమార్లు డబ్బులు ఇచ్చిన ఆ యువకుడు ఆ మహిళ ను పెళ్లి చేసుకుందాం అని అడగడంతో ఆమె నెంబర్ బ్లాక్ చేసింది. ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ కు చెందిన స్వాతి గా పోలీసులు గుర్తించారు. ఆమెకు ఇది వరకే పెళ్లి అయ్యి ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు యువకుడు గుర్తించాడు. బాధితుడు బోధన్ కోర్టు ను ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసి బోధన్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts

సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు

Bhavani

ప్లాస్మా దానానికి అందరూ సిద్ధం కావాలి

Satyam NEWS

ఆక్సిడెంట్:హాసన్ పర్తీ లో ఆటోను డీకొట్టిన లారీ ఇద్దరి మృతి

Satyam NEWS

Leave a Comment