విశాఖపట్నం నారాయణ విద్యా సంస్థల్లో భాగమయిన ఎన్ ఏ డి బ్రాంచ్ లో విద్యార్థిని విద్యార్థులు అంతా వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల నుండి ఎన్ ఏ డి కూడలి వరకు పచ్చదనం గురించి అనేకమయిన స్లొగన్స్ తో ఊరేగింపు గా చేసారు.
కొంతమంది విద్యార్థులు చెట్లు చేమలు గూర్చి నాటిక రూపంలో మరియు నృత్య ప్రదర్శనలుతో ఆనందింపచేశారు. ఈ వన మహోత్సవానికి సీనియర్ జర్నలిస్ట్ తిలక్ ముఖ్య అతిధి గా వచ్చి పిల్లలు చేసే కార్యక్రమాల్ని చూసి హర్షధ్వానాలు పలికారు. అలాగే నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్ ధనలక్ష్మి విద్యార్థుల ప్రతిభను చుసి కొనియాడారు పై కార్యక్రమానికి ఏ జి ఎం రాజకుమార్ అకాడమిక్ కో ఆర్డినేటర్ రామ్ నరేష్ మరియు ఉపాధ్యాయిలంతా పాల్గొన్నారు.