38.2 C
Hyderabad
April 29, 2024 14: 19 PM
Slider ఆదిలాబాద్

నిరుద్యోగ సమస్యపై నిర్లిప్తంగా ఉన్న ప్రభుత్వాలు

YouthCongress

నిరుద్యోగ సమస్యపై సొషల్ మీడియా అకౌంట్ల నుండి గళమెత్తాలని యువజన కాంగ్రెస్ జాతీయ కమిటి పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి యువజన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు కుబిడే రాకేష్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడి ప్రభుత్వం రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని ఆ దిశగా ఇంతవరకు ఎటువంటి కార్యచరణ ప్రకటించలేదని అన్నారు.

తెలంగాణలో కెసిఆర్ ఇంటికొక ఉద్యోగమిస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చాక ఒకే ఒక్క సంవత్సరంలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతానని అసెంబ్లీ సాక్షిగ చెప్పి ఆరు సంవత్సరాలు నిండుతున్నా ఆ పని చేయలేదని అన్నారు.

నిండా 40 వేల ఉద్యోగాలు కూడా నింపకపోగా రాష్ట్ర వ్యాపితంగా ఉన్న వేలాది మంది కాంట్రాక్టు, Outsourcing ఉద్యోగులను తీసివేసిందని కరోనా వల్ల పెరిగిన నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఎటువంటి ప్రణాళిక లేదని వారన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గణపురం నాగేశ్వర్, గణపురం బాపూజీ, గణపురం వెంకన్న, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు రౌతు భుజంగరావు, బందర్కంటి శేఖర్, డబ్బుల పురుషోత్తం, దందెర శ్రీనివాస్, ఎండీ సాజీత్, సంగం సాయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోడిపందాల స్థావరంపై పోలీసు దాడులు

Satyam NEWS

మెటర్నిటీ హెల్త్ అవార్డు గ్రహీతలకు అభినందన

Bhavani

ఆంధ్రాలో బీజేపీ నాయకులలో మార్పు రాదా?

Satyam NEWS

Leave a Comment