తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నరసింహులు ఈ రోజు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రాగడ్డ ప్రసూన ను కలిశారు.
ప్రసూన ఆహ్వానం మేరకు సనత్ నగర్ లోని ఆమె నివాసనికి వెళ్ళి రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.
ప్రసూన బక్కని నరసింహులుకు సాదరంగా స్వగతం పలికి, వారి కుటుంబ సభ్యులను పరిచయం చేసి, అనంతరం నరసింహులును శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బి.సి-సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సుర్యదేవర లత, బల్కంపేట్ డివిజన్ టిడిపి నాయకులు బక్కని నరసింహులును మర్యదపుర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు.