నల్లగొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శాంతి, అహింసలకు మారుపేరైన వాసవీ మాత ఆత్మార్పణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
స్థానిక వాసవీ భవన్ లో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవీ మాతకు పంచామృత, ఫలరసాలతో అభిషేకములు, మహిళలచే కుంకుమ పూజ, హోమం, పుష్పార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు.
దేవులపల్లి నాగరాజు శర్మ, రాధాకృష్ణ శర్మ, శ్యామ్ శర్మల వేద మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. శాంతి, అహింసలకు ప్రతిరూపంగా పార్వతీ దేవి అంశలో జన్మించిన వాసవీ మాత ఆత్మార్పణ చేసుకొని వైశ్య కులదేవతగా అవతరించిందని వైశ్య సంఘ నాయకులు చెప్పారు.
పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు యామా మురళి నేతృత్వంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలలో సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనమ్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు, ప్రధాన కార్యదర్శి వనమా మనోహర్, కమిటీ సభ్యులు భూపతి రాజు, కోటగిరి చంద్రశేఖర్, నల్లగొండ అశోక్, గుబ్బా శ్రీనివాస్, బండారు వెంకటేశ్వర్లు, కోటగిరి రామకృష్జ, మిర్యాల మహేష్, తేలుకుంట్ల శ్రీకాంత్, దుండిగల్ల ఓంప్రసాద్, పారేపల్లి వెంకన్న, నాంపల్లి నర్సింహా, నాగుబండి రామకృష్ణ, బండారు సురేష్, అర్ధం శ్రీనివాస్, వందనపు వేణు, నాళ్ల వెంకటేశ్వర్లు, వాసా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.