ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నిర్వహించిన ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభకు వెళ్లి తిరిగి వస్తూ ఒకరు మరణించారు.
జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండల కేంద్రంలో జరిగిన ఈ సభలో ఈ దుర్ఘటన జరిగింది.
చిన్నబోయినపల్లి కి వెళుతూ ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన కుసుమ రాజ్ కుమార్ అనే వ్యక్తి మరణించాడు.
తీవ్రంగా గాయపడిన అతడిని ఘటనా స్థలం నుండి వరంగల్ ఎంజీఎం కు చేర్చగా అక్కడకు చేరుకున్న ఐదు నిమిషాలకు మృతి చెందాడు.
మృతుడు రాజ్ కుమార్ ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కు బంధువు.