కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం లో అధ్యత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో రాఘవేంద్రుని బృందావనం స్వర్ణమయమై కనులవిందు కలిగించింది. ఆదివారం శ్రీ మఠం లోని రాఘవేంద్రుని మూల బృందావనాన్ని పూజారులు నిర్మాల్యం చేసి తులసి అర్చన పంచామృత అభిషేకం నిర్వహించారు.
అనంతరం బృందావనాన్ని స్వర్ణకవచ లతో పట్టువస్త్రాలతో వివిధ పుష్ప హారాలతో అందంగా అలంకరించారు. పీఠాధిపతి శ్రీ సుభుదేంధ్రతీర్ధులు రాఘవేంద్రుని ఆరాధ్యదైవమైన మూల రాములకు విశిష్ట పూజలు నిర్వహించిన అనంతరం రాఘవేంద్రుని బృందావనాని దర్శించుకొని నైవేద్య సమర్పణతో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతులు ఇచ్చారు.