తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ప్రమాదంలో చిన్నారి సహా దంపతులు స్పాట్ లోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు. ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద
తిరుపతి -శ్రీకాళహస్తి రోడ్డుపై ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. మృతులను మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లెకు చెందిన వారిగా
పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.