ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. లీటర్ పెట్రోల్పై 1.24 పైసలు, లీటర్ డీజిల్పై 0.93 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని రెవిన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ తెలిపారు.
గత ఏడాది ఏప్రిల్ నెలలో 4,480 కోట్లుగా ఉన్న ఆదాయం.. 29.5 శాతానికి తగ్గి 1,323 కోట్లకు పడిపోయిందని వెల్లడించారు. జూన్ నెలలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందని ఉత్తర్వులో పేర్కొన్నారు. పడిపోయిన రాష్ట్ర రెవెన్యూను పెంచుకోవడానికే ధరలు పెంచుతున్నామని ఆయన తెలిపారు.