29.7 C
Hyderabad
May 3, 2024 03: 10 AM
Slider రంగారెడ్డి

కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

#uppalmla

ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్  రామకృష్ణ కాలనీలో మంచి నీటి సౌకర్యంతో పాటు సిసి రోడ్లు చర్లపల్లి కనెక్టివిటీ రోడ్డు నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హామీ ఇచ్చారు.

రామకృష్ణ కాలనీలో తాగు నీరు, సిసి రోడ్ల నిర్మాణంతో పాటు చర్లపల్లి కనెక్టివిటీ రోడ్డును అభివృద్ధిపరచాలని కోరుతూ నూతనంగా ఎన్నికైన కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు,  చర్లపల్లి కాలనీల సమాఖ్య CCS ఆధ్వర్యంలో  శనివారం ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామకృష్ణ కాలనీలో తాగునీటి పైప్ లైన్ల నిర్మాణం కోసం  ప్రణాళికలు సిద్ధం చేయాలని జలమండలి జిఎం జాన్ షరీఫ్ కు ఆదేశించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన శ్రీ రామకృష్ణ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శి వర్గం సభ్యులను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి శాలువాలు కప్పి కాలనీ సంక్షేమం కోసం కలసికట్టుగా పని చేస్తూ ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి, నాయకులు డప్పు గిరిబాబు జౌండ్ల ప్రభాకర్ రెడ్డి, రెడ్యానాయక్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శి వర్గ సభ్యులు ఎలుక రాంప్రసాద్, అంకాలం రమేష్, ఉపాధ్యక్షులు గోసుల దేవరాజు, కోశాధికారి గుండె నవీన్, మోహన్ లాల్, ఎల్లారావు, ప్రవీణ్ కుమార్,మహేష్, ప్రసాద్, చిన్నారావు, అనిల్ రెడ్డి, సోమ రెడ్డి, మ్యాత్య్ స్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎన్టీఆర్ విగ్రహ ప్రారంభ ఏర్పాట్లు పై చర్చించిన పువ్వాడ, ఎన్టీఆర్

Bhavani

ఫేస్ బుక్ నకిలీ ప్రొఫైల్స్ కేసులో పోలీస్ కస్టడీకి నిందితులు

Satyam NEWS

ఇల్లీగల్:డబ్బు పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్త

Satyam NEWS

Leave a Comment