వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుగుతున్నది. రాజన్న సన్నిధానంలో ఉత్తరద్వారం గుండా స్వామివార్లు దర్శనం ఇస్తున్నారు. భక్తజనం స్వామివార్లను చూసి పులకించిపోతున్నారు.
రాజన్న క్షేత్రం లో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. నేటి పర్వదినాన గజ వాహనాలపై భక్తులకు స్వామి వార్లు దర్శనం ఇస్తున్నారు. వేములవాడ నేడు భక్తులతో నిండిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో వేములవాడ క్షేత్రం కోలాహలంగా ఉంది.