పండగపూట కూడా బస్తీలు మురికివాడల్లానే ఉంటున్నాయని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ గౌడ్ అన్నారు. సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా బస్తీలు పరిశుభ్రంగా ఉంచితే మహిళలకు సౌకర్యంగా ఉంటుందని అయితే అధికారులు ఆ విధంగా చేయడం లేదని ఆయన అన్నారు.
హైదరాబాద్ నగరంలోని బాగ్ అంబర్పేట్ డివిజన్ లోని చాలా బస్తీలలో డ్రైనేజి పైపులైను కోసం గోతులు తవ్వి వదిలేశారని ఆయన అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఆడపడుచులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన జీహెచ్ఎంసి అధికారరులను కోరారు. ఎక్కడెక్కడ ఉన్నాయో చూడి అక్కడ క్లీన్ చేయాలని ఆయన కోరారు.
సత్యంన్యూస్, అంబర్ పేట్