రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా కాటుకు కుటుంబాలకు కుటుంబాలే తల్లడిల్లుతున్నాయి.కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తులు కరొనతో విగతజీవులవుతుండగా కుటుంభం సభ్యులు తీవ్రంగా విలవిలలాడుతున్నారు.వేములవాడ పట్టణంలో ఇటీవల కరోనా తో ఆలయ ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ బొందిల శివ ప్రసాద్ మృతి చెందాగా కొడుకు మరణం తట్టుకోలేని అతని తల్లి వేములవాడ గ్రామ పంచాయితి మాజీ వార్డ్ సభ్యురాలు బొందిల శాంతమ్మ 65 మంగళవారము సాయంత్రం గుండె పోటు తో మృతి చెందారు.వారం రోజుల క్రితమే అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు శివ మృతి చెందగా అతని జ్ఞాపకాలతో బాధపడుతున్న శాంతమ్మకు ఈరోజు గుండెపోటు తో మృతి చెందగా పట్టణం లో ఆలయ వర్గాల్లో ,సన్ని హితుల్లో, విషాద ఛాయలు నెలకొన్నాయి.ఆమె అప్పటి సీనియర్ టిడిపి నాయకుడు బొందిల నర్సయ్య భార్య .శాంతమ్మ మృతికి పలువురు నాయకులూ సంతాపం వ్యక్తం చేశారు.కాగా వారం రోజుల్లో తల్లి కొడుకులు మృతి చెందడం పట్టణం లో కలవరం రేపుతోంది.
previous post