కొత్తగా ఆవిర్భవించిన విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ కరోనా నివారణకు సరికొత్త ప్రయోగాన్ని ప్రారంభించింది.
లాక్ డౌన్ లేని సమయాల్లో అదీ కూడా రద్దీ ఉన్న ప్రాంతాల్లో సోడియం క్లోరైడ్ ను సరికొత్త మిషన్ ద్వారా చల్లే యత్నం ప్రారంభించింది.
ఈ మేరకు నగరంలో ని గంటస్థంభం వద్ద ప్రత్యేక యంత్రం ద్వారా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సత్యనారాయణ ప్రారంభించారు.
ఈ మిషన్ రద్దీ గా ఉన్న ప్రాంతాలు, గుంపులు గుంపులు గా ఉండే ప్రాంతంలో చల్లడం జరుగుతుందని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సత్యనారాయణ తెలిపారు.