నెల్లూరు నగరంలోని స్థానిక కస్తూరి దేవి గార్డెన్స్ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆత్మీయ అభినందన సభ ప్రాగణంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ రాష్ట్రపతి అవార్డు వార్డు గ్రహీత చుక్కల పార్థసారథిని వెంకయ్య నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో తన వంతు ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన పార్ధు చదువుతోపాటు ప్రజలకు విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ ద్వారా సేవలను అందించడం సంతోషదాయకం అని అన్నారు. విద్యార్థులు తనను పూర్తిగా తీసుకొని చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని తెలిపారు.
ప్రశంసించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
జాతీయ స్థాయి అవార్డును అందుకున్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ చుక్కల.పార్ధసారథిని నెల్లూరు లోక్ సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభినందించారు. నెల్లూరు విద్యార్థులు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో రాణించటం ఎంతో సంతోషంగా మరియు గర్వంగా ఉందన్నారు. పార్థసారథి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని, అందుకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. ఉపకులపతి, ఆచార్య జి యం సుందరవల్లి కి, రిజిస్ట్రార్ డా. పి రామచంద్ర రెడ్డి కి , ఎన్ ఎస్ ఎస్ సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం ని అభినందించారు.