విజయనగరం జిల్లాలో ఎస్పీ దీపికా ఆదేశాల మేరకు గజపతి నగరం పోలీసులు…29 కేసులలో ఓ నిందితుడిని పట్టుకున్నారు.ఈ మేరకు సీఐ రమేష్.. ఎస్ఐతో కలిసి నిందితుడు ని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ మేరకు పురిటిపెంటలో నిందితుడు ని పట్టుకుని పోలీసులు..2న్నర తులాలు తో పట్టుకున్నారు.
ఇటీవల గజపతినగరం మండలం పురిటిపెంటలో జరిగిన బంగారం చోరీ కేసులో నిందితుడుని అరెస్టు చేసి, 48 గంటల్లోనే చోరీ మిస్టరీని ఛేదించినట్లుగా గజపతినగరం సిఐ డి.రమేష్ తెలిపారు. ఈ మేరకు నిందితుడి వద్ద నుండి 2 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడి పై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో 29 కేసులు ఉన్నాయని తెలిపారు. కాగా నిందితుడు జిల్లాలో ని బొబ్బిలి మండలం కుమందానపేట కు చెందిన కొల్లి జగన్మోహన్ రావుగా గుర్తించారు. నిందితుడు గతంలో మల్టీమీడియా చదివాడని గజపతినగరం ఎస్ఐ గంగరాజు తెలిపారు.