జాగృతి సేవా సమితి బిచ్కుంద ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద ధడ్గి లో గల 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ప్రేరణ గా పరీక్ష అట్టలను పెద్ద ధడ్గి గ్రామ సర్పంచ్ ఆకుల సాయిలు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలను రాసి మార్కులు సాధించి గ్రామానికి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జాగృతి సేవా సమితి అధ్యక్షులు రచ్చ శివకాంత్, గ్రామ ఉప సర్పంచ్ సాయిలు, ప్రధానోపాధ్యాయులు యెన్నావర్ అశోక్, జాగృతి సభ్యులు వంగ నర్సింలు, పి అనిల్, యస్ సంజయ్, యన్ గంగారాం ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.