మండు టెండలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే ట్రాఫిక్ సిబ్బందికి కాస్త ఉపశమనం కలిగించేందుకు హేట్స్ టోపీలతో పాటు, చల్లటి కళ్లద్దాలు ను పంపిణీ చేసారు….ఏపీలో ని విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా.అలాగే విజయనగరం ఆర్టీసి కాంప్లెక్స్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం ను జిల్లా ఎస్పీ దీపిక, ప్రారంభించారు.
అలాగే ప్రజలకు, ఆటో డ్రైవర్లు కు మజ్జిగను పంపిణీ చేశారు. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.ఇక వేసవిలో తీవ్ర ఎండల్లో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు కాస్తా ఉపశమనం పొందేందుకు, రక్షణ పొందేందుకు, వారి సంక్షేమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులకు హ్యాట్ లను, చలువ కళ్లద్దాలను జిల్లా ఎస్పీ ఎం.దీపిక, పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, దిశా డీఎస్పీ శ్రీ టి.త్రినాథ్, వన్ టౌన్ సీఐ జే.మురళి, ట్రాఫిక్ ఎస్ఐ లు భాస్కర రావు, దామోదర్, హరిబాబు నాయుడు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.