పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న కుడికిల్ల రైతులకు న్యాయమైన ప్యాకేజీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు.
మంగళవారం కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్ మండల అధ్యక్షుడు పరుశురాం నాయుడు కుడికిల్ల గ్రామ రైతుల సమస్యలపై భూసేకరణ అధికారితో మాట్లాడారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో 3మెయిన్ కెనాల్ తవ్వకాలకు అవసరమున్న 272 ఎకరాల భూములకు సంబంధించిన 120మంది రైతులకు న్యాయ మైన ప్యాకేజ్ ఇవ్వాలని వారు కోరారు.
లేక పోతే ప్రత్యమ్నాయం చూపాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ లతో కూడిన విన్నతిపత్రాన్ని భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మికి అందచేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిరాజ్, నరసింహ్మ ,కుడికిల్ల బూబాధిత రైతులు పాల్గొన్నారు