విజయనగరం లో వన్ టౌన్ పోలీసులు వినూత్న మైన చర్యలు
లా అండ్ ఆర్డర్ పోలీసులు… చేత లాఠీ ,పిస్తోల్ పట్టుకోవడం ఎప్పుడో మానేసారు.నేరాలు.. ఘోరాలు తగ్గాయనుకోండి.కానీ ఆ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇప్పుడు శాంతి పధంలో నడుస్తున్నారు..అదీ మాస్టార్ల అవతారం ఎత్తి… మంచి పౌరులు గా..మెలగాలంటూ చట్టంలో రూపొందించిన అంశాలపై అవగాహన చర్యలు చేపడుతున్నారు. కావాలంటే.. విజయనగరం పోలీసు డివిజన్ లో…వన్ టౌన్ పోలీసులు చేపట్టిన చర్యలే అందుకు ఉదాహరణ.విజయనగరం లోద్వారపూడి జంక్షన్ సమీపంలోని మహాలక్ష్మీ జూనియర్ కళాశాల విద్యార్థులకు వన్ టౌన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ డా బి.వెంకటరావు మాట్లాడుతూ – విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకొని, వాటి లక్ష్య సాధనకు కృషి చేసి, ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. విద్యార్థులు, మహిళల రక్షణకు ప్రతీ ఒక్కరూ తమ మొబైల్స్ లో దిశా ఎస్ఓఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఆపద సమయంలో ఎస్ ఓఎస్ బటన్ ప్రెస్ చేసి పోలీసుల సహాయం పొందాలన్నారు. సైబరు మోసాలు, రుణ యాప్ ల వలన కలిగే నష్టాలు విద్యార్దులకు సిఐ వివరించి, వాటికి దూరంగా ఉండాలన్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకుని వస్తే, వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో వన్ పోలీసులు పోలీసులు, కళాశాల యాజమాన్యం, లెక్చరర్స్ మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు