29.7 C
Hyderabad
May 2, 2024 06: 36 AM
Slider ముఖ్యంశాలు

క్షమాపణ చెప్పిన తర్వాత చంద్రబాబు విజయనగరం లో అడుగు పెట్టాలి

#vijayanagaramzp

టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనపై వైఎస్సార్సీపీ లో గుబులు రేగినట్లుంది. విజయనగరం జేడ్పీ ఆఫీస్ లో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో “చంద్రబాబు పర్యటన”పైనే జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడారు. విజయనగరం జిల్లాకు 2019 ముందు ఇచ్చిన హామీలను నెరవేరచ్చని ఆయన ఏ మోహంతో “ఇదేం ఖర్మరా బాబూ” అన్న కార్యక్రమంతో జిల్లా లో అడుగు పెడతారని జేడ్పీ చైర్మన్ ప్రశ్నించారు. సాగు నీటి ప్రాజెక్టులు గాని, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం గాని భోగాపురం ఏర్ పోర్ట్ పనులు ప్రారంభోత్సవం గాని జేఎన్టీయూ కు గురజాడ పేరు పెట్టడంలో గాని ఇలా ఏ విషయం చంద్రబాబు ప్రభుత్వం లో నిర్ణయం తీసుకుందో చెప్పాలని శ్రీనివాసరావు విలేకరుల సాక్షి గా ప్రశ్నించారు.

కానీ వైఎస్సార్సీపీ అధినేత ఎన్నికల లలో అదే 2019 కి ముందు తాను చేపట్టిన పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామీ లకు అనుగుణంగా నవరత్నాలలో.. వాటికి నిధులు మంజూరు చేసో పనులు ప్రారంభిస్తే..దాన్ని చూస్తూ ఓర్వలేక… టీడీపీ “ఇదేం ఖర్మరా బాబూ” అని కార్యక్రమం నిర్వహించడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ముందు నేను చెప్పిన మూడు అంశాలు….చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో నిర్ణయం తీసుకోలేదు కనుక ముందు వాటిని నెరవేర్చలేనదంకు గాను క్షమాపణలు చెప్పిన తర్వాతే విజయనగరం లో అడుగు పెట్టాలని జేడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు.

Related posts

నమస్తే తెలంగాణకు నోటీసులు

Satyam NEWS

వలస దుఃఖం

Satyam NEWS

డీ జీ పీ చేతుల మీదుగా అవార్డు లు అందుకున్న ఎస్పీలు

Satyam NEWS

Leave a Comment