33.2 C
Hyderabad
May 4, 2024 02: 29 AM
Slider విజయనగరం

విజయనగరం రైల్వే స్టేషన్ కు మహర్దశ

#vijayangaramrly

రూ. 375 కోట్ల తో పునరాభివృధ్ధికి పీఎం మోడీ శంకుస్థాపన

ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో వాల్తేర్ డివిజన్ లో విజయనగరం రైల్వే స్టేషన్ కు మహర్దశ లభించింది. ప్రధాని మోడీ… దేశ వ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ పునరాభివృధ్ధి లో భాగంగా…”అమృత్ పథకం”లో విజయనగరం రైల్వే స్టేషన్ ఎంపికవ్వడం…విశేషం. విజయనగరం వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పుణ్యమా.. విజయనగరం వాసులకు అందునా…విజయనగరం రైల్వే స్టేషన్ ను దాదాపు 370 కోట్ల తోప్రధాని మోడీ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల హాజరయ్యారు.

ఈ మేరకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ… విజయనగరం రైల్వే స్టేషన్ పునరాభివృధ్ధికి స్వయంగా పీఎం మోడీ ముందు కు రావడం… విజయనగరం ప్రజలతో పాటు తాను అదృష్టం గా భావిస్తున్నానని అన్నారు. దేశ వ్యాప్తంగా 507రైల్వే స్టేషన్ లలో విజయనగరం ఒకటి ఉండటం..మరింత సంతోషకరమైన విషయమన్నారు. అదీ విజయనగరం ఎంఎల్ఏగా ,ఒక డిప్యూటీ స్పీకర్ గా నా హయాంలో శంకుస్థాపన జరగడం అదృష్టం గా భావిస్తున్నానని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అన్నారు. అంతకు ముందు ఎంఎల్సీ పీ.సూర్య నారాయణ రాజు సురేష్ మాట్లాడుతూ… పీఎం మోడీ హాయాంలో ఒక ఎంఎల్సీ గా మూడు కార్యక్రమాలలో పాల్గొనడం… నేను ఒక వరంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు సుధీర్, శివ ,శ్రీనివాస్… తదితరులు హాజరయ్యారు.

Related posts

ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి

Satyam NEWS

విషాదం: అనారోగ్యంతో సినీ నటి మీనా భర్త మృతి

Satyam NEWS

50 బైక్ అంబులెన్సు సర్వీసుల ప్రారంభం

Satyam NEWS

Leave a Comment