28.7 C
Hyderabad
April 28, 2024 03: 26 AM
Slider ముఖ్యంశాలు

గద్దర్ మృతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాప సందేశం

#kishanreddy

ప్రజా యుద్ధ నౌకగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటుచేసుకున్న విప్లవ గాయకుడు శ్రీ గద్దర్  (గుమ్మడి విఠల్ రావ్) కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన గద్దర్, తెలంగాణ ఉద్యమంలోనూ తన పాటతో, తన మాటతో సరికొత్త ఊపును తీసుకొచ్చారని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయాల వేదికగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన పడిన సమయంలో.. ‘పొడుస్తున్న పొద్దమీద నడుస్తున్న కాలమా!’ అన్న గద్దర్ పాట ఓ సంచలనం. తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో చాలా సందర్భాల్లో వేదిక పంచుకునే అవకాశం లభించింది. రాష్ట్ర సాధనకు సంబంధించిన ఎన్నో అంశాలను పరస్పరం పంచుకునే అవకాశం కూడా దొరికింది అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2012లో తాను చేపట్టిన ‘తెలంగాణ పోరుయాత్ర’ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో గద్దర్ తనతో కలిసి నడిచారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related posts

హిందువుగా జీవించు

Satyam NEWS

పేదలకు మెరుగైన వైద్య సేవలు

Bhavani

ది. 08.08.2023 పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం

Bhavani

Leave a Comment