38.2 C
Hyderabad
May 5, 2024 23: 02 PM
Slider ముఖ్యంశాలు

మంత్రి బొత్స ను అనాలంటే నా సంస్కారం అడ్డొస్తోంది…!

#nagarjuna

మాజీ సీఎం ,టీడీపీ అధినేత ను…పుడింగని మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ చేయడం… ఆయన స్థాయి దిగజారడమేనని విజయనగరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటన గురించి మంత్రి బొత్స మాట్లాడుతూ… చంద్రబాబు ను దుర్భాషలాడటం…పద్దతి గా లేదన్నారు.

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గా చేసి…ప్రస్తుత జగన్ ప్రభుత్వం లో ఉత్తరాంధ్ర నుంచీ ఏకంగా చక్రం తిప్పుతున్న మంత్రి బొత్స… చంద్రబాబు పై అలా మాట్లాడటం పద్దతి గా లేదన్నారు. అసలు పుంగనూరు లో మంత్రి పెద్దా రెడ్డి ఓ రౌడీ లా వ్యవహరిస్తున్నారని నాగార్జున స్పష్టం చేశారు. ఇటీవల తాను ఆ నియోజకవర్గంలో పర్యటిస్తే…అధికార పార్టీ అనుచరులే…జెండా లతో రెచ్చగొట్టారని గుర్తు చేశారు. అదే విజయనగరం లో ఏ మంత్రి వచ్చిన మనం అలా చేసామా అని అన్నారు. మంత్రి బొత్స కు వయస్సు పైబడుతోందని…బుద్ది మందగిస్తోందని…ఇక నుంచీ అయినా జాగ్రత్తగా మాట్లాడాలని టీడీపీ నేత నాగార్జున అన్నారు.

Related posts

బ్రెజిల్‌లో విరిగిపడ్డ కొండ చరియలు

Sub Editor

జిందాల్ స్టీల్స్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

Satyam NEWS

ఆ ఘనత ఎన్టీఆర్ కే చెల్లింది!!

Satyam NEWS

Leave a Comment