ములుగు జిల్లా పంచాయతి కి నానాజీ దేశముఖ్ సర్వోత్తం పంచాయతి సతత్ వికాస్ పురస్కారం దక్కింది. కేంద్ర పంచాయతి రాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ పంచాయతి అవార్డులలో ములుగు జిల్లా పంచాయతి కి జాతీయ స్థాయిలో రెండవ స్థానం దక్కింది. ఇటీవల జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీ ల నుండి జాతీయ పంచాయతి అవార్డులకు పాల్గొనగా అన్ని పంచాయతీలా ప్రదర్శన ఆధారంగా జిల్లా కు అవార్డు ప్రకటించడం జరిగినది.
ఈ నెల 17 వ తేదీ న దేశ రాజధాని ఢిల్లీ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు, రూ. 3 కోట్ల క్యాష్ రివార్డు ప్రధానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డు ప్రధాన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్, జిల్లా పంచాయతి అధికారి హాజరు అవుతారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ సంపూర్ణ మద్దతు, దిక్సూచి, సర్పంచ్, ప్రజా ప్రతినిధుల సహకారం, గ్రామ పంచాయతి కార్యదర్శుల, MPO ల కృషి ఫలితంగా అవార్డు దక్కడం అతి నూతన జిల్లా అయినా ములుగు కు జాతీయ అవార్డు రావడం శుభపరిణామం అని డి. పి. ఓ. వెంకయ్య ప్రకటనలో పేర్కొన్నారు.