33.2 C
Hyderabad
May 3, 2024 23: 41 PM
Slider ప్రత్యేకం

మా నిధులు కొల్లగొట్టారు: గవర్నర్ కు సర్పంచ్ ల ఫిర్యాదు

#rajendrababu

రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన గ్రామ పంచాయతీలకు చెందిన రూ. 7660 కోట్లను నిధులు తక్షణమే తిరిగి ఇప్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాలు నేడు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు విజ్ఞప్తి చేశాయి.

ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి (కర్నూలు జిల్లా), సర్పంచుల సంఘం నాయకులు అన్నెపు రామకృష్ణ (శ్రీకాకుళం జిల్లా), వానపల్లి  ముత్యాల రావు (విశాఖ జిల్లా), మూడే శివ శంకర్ యాదవ్ (కృష్ణా జిల్లా) ఇతర  సర్పంచుల సంఘం నాయకులు గవర్నర్ ని కలిసిన వారిలో ఉన్నారు.

రాష్ట్రంలోని 12918 గ్రామ పంచాయతీల సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. 2018 నుంచి 2022 వరకు 14, 15 వ  ఆర్థిక సంఘాల నిధులను కేంద్ర ప్రభుత్వం రూ. 7660 కోట్లను రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పంపించింది.

ఈ నిధులను గ్రామాలకు పంపించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయాలేదు. పైగా సర్పంచులకు తెలియజేయకుండా, చెక్కుల పై సర్పంచుల సంతకాలు తీసుకోకుండా, పంచాయతీ బోర్డు తీర్మానాలు లేకుండా అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ రూ. 7660 కోట్ల ను దారి మళ్లించి, తన స్వంత అవసరాలకు, స్వంత పథకాలకు వాడేసుకుందని వారు తెలిపారు.

రాత్రికి రాత్రే అడ్డగోలుగా నిధులు దారి మళ్లించడంతో పంచాయితీ ఖాతాలు జీరో /నిల్ బ్యాలెన్స్ చూపిస్తున్నాయి. దీంతో సర్పంచులు ఖంగుతిన్నారు. రాష్ట్రంలోని 12918 గ్రామ సర్పంచులు గ్రామాల అభివృద్ధికి నిధులు లేవని గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వెల్లడి చేస్తున్నారు.

ఇటీవల దీనిపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల సర్పంచులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆం.ప్ర. సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసినా  రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు.  దీనివలన గ్రామాలలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్,  లైటింగ్ సౌకర్యాలను గ్రామాల ప్రజలకు కల్పించడానికి నిధులు లేక సర్పంచులు ఉత్సవ విగ్రహాలు లాగా మిగిలిపోయారు.

రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వవలసిన నిధులను ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను హైజాక్ చేయడం దుర్మార్గమని వారు గవర్నర్ కు చెప్పారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్టవిరుద్ధం, ఇది అనైతికం, అన్యాయం, దుర్మార్గం ఒకరకంగా రాష్ట్ర ప్రభుత్వం సైబర్ నేరానికి పాల్పడిందని వారు వెల్లడించారు. ఇది 73,74 వ రాజ్యాంగ సవరణ చట్టాల స్ఫూర్తికి విఘాతమని అందువల్ల తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని వారు కోరారు.

Related posts

మారుతీ సుజుకి  కార్ల  రీకాల్

Murali Krishna

Reseña De Casa De Apuestas Y Bonos Mostbet Peru

Bhavani

సీఎఫ్ఐ ఏపీ ప్రధాన కార్యదర్శి గా లలిత్ కుమార్

Satyam NEWS

Leave a Comment