మారుతీ సుజుకీ ఇండియా కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. వేగనార్, సెలెరియో, ఇగ్నిస్కు చెందిన మోడళ్లలో కొన్ని కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. వెనక బ్రేక్ అసెంబ్లీ పిన్ లోపం ఉండే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2022 ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 1 మధ్య తయారైన 1.81 లక్షల కార్లలో లోపం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
previous post
next post