అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బధిర బాలికపై 30 ఏళ్ల ఓ కామాంధుడు లైంగికదాడికి తెగబడ్డాడు.విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి గ్రామీణ పోలీస్స్టేషన్ ఎస్సై రామకృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో 30 ఏళ్ల రాజాన సింహాచలం అనే వ్యక్తి ఇంటినుంచి దూరంగా తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
తనకు జరిగిన ఘోరాన్ని చెప్పుకోలేని ఆ బాలిక పరిస్థితిని ఇంటి పక్కనే ఉన్న మరో మహిళ గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె బాలిక తల్లికి చెప్పింది. ఈ మేరకు బాలిక తల్లి శనివారం ఫిర్యాదు చేశారని ఎస్సై తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను వైద్యపరీక్షలకు తరలించారు.