రాష్ట్రంలోనే ప్రసిధ్ధిగాంచిన ఖాదర్ వలీ బాబా ఆశ్రమాన్ని..విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు రాత్రి సమయంలో సందర్శించారు.
గత మూడు రోజుల నుంచీ విజయనగరం బాబా మెట్టలో ఖాదర్ వలీ ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ జయరాజ్ కూడా తమ వంతు సేవా ధృక్పధాన్ని కనపరిచారు.
ఆశ్రమం లో బాబా నడియాడిన అన్ని ప్రదేశాలను డీఐజీ రంగారావు అమితమైన ఆసక్తి గా పరిశీలించారు. డీఐజీ తో పాటు.. అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ రావు, విజయనగరం డీఎస్పీ అనిల్ ,నగర పోలీసు లు మురళీ ,శ్రీనివాసరావు, మంగవేణి, నారాయణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బాబా ఉరుసు ఉత్సవాలకు భక్తులు హాజరయ్యారు.