రక్తదానం మరొకరికి ప్రాణదానం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రయివేట్ వైద్యశాలలో ఒక పెద్దావిడకు ‘బి’ పాజిటివ్ రక్తం అత్యవసరం ఉన్న విషయాన్ని తెలుసుకున్నా జనచైతన్య ట్రస్ట్ సభ్యులు వంశీ,పార సాయి,శివశంకర్ లు తక్షణమే అదే గ్రూప్ బ్లడ్ డోనర్ అయిన కోలపూడి యోహాన్ ని సంప్రదించి సకాలంలో హాస్పిటల్ వద్దకు పంపి ‘బి’ పాజిటివ్ రక్తం ఇప్పించడం జరిగింది.
అత్యవసర సమయంలో గురువారం జనచైతన్య ట్రస్ట్ తరుపున 303వ, వ్యక్తికి రక్తదానం చేసిన కోలపూడి యోహాన్ కు ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.రక్త దాత కోలపూడి యోహాన్ మాట్లాడుతూ రక్తదానం చేసి మరొకరి ప్రాణం నిలబెట్టినందుకు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని,ప్రతి ఒక్కరూ ఆపత్కాలంలో అవసరమైన వారికి రక్తదానం చేసి మరొకరి ప్రాణం నిలబెట్టినందుకు ముందుకు రావాలని అన్నారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు పార సాయి మాట్లాడుతూ అత్యవసర సమయంలో మేము ఫోన్ చేయగానే స్పందించి రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా యువతకు జనచైతన్య ట్రస్ట్ తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రజలకు,యువతకు రక్తదానం చేయడం పట్ల అవగాహన కల్పిస్తూ, ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతామని అన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్